సిరాన్యూస్, ఖానాపూర్
బాదనకుర్తి చెక్ పోస్ట్ వద్ద రూ.4,69,500 నగదు పట్టివేత
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బాదనకుర్తి గ్రామం చెక్ పోస్ట్ వద్ద సోమవారం ఎస్ఎస్ టి, టీమ్ వాహనాలు తనిఖీ చేయగా రూ.4,69,500 నగదును పట్టుకున్నారు.ఏనుగుల రాములు వద్ద రూ. 1,00,000, ఎండి బసిరుద్దీన్ వద్ద రూ.59,500, కేండా బక్కయ్య వద్ద రూ.90000, బైరి అంజయ్య వద్ద రూ.2,20,000, మొత్తం రూ. 4,69,500 ఎలాంటి పత్రాలు లేకుండా పోవడంతో నగదును సీజ్ చేశారు. ఎస్ఎస్సి టీమ్ లో భాగంగా ఇంచార్జి టి. బాపు, సరే శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ డైవాకర్, కాన్స్టేబుల్ రవి లు ఉన్నారు. వీరిని సీఐ సైదారావు అభినందించారు.