నగదు పట్టివేత

నగదు పట్టివేత

 సిరా న్యూస్,చీరాల;
బాపట్ల జిల్లా లో అధికారుల దాడుల తో ఎన్నికల వేళ హీట్ మొదలైంది.చీరాల మండలం కావూరి వారి పాలెం గ్రామంలో రాయల్ మెరైన్ రొయ్యల ఫ్యాక్టరీలో ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు స్థానిక పోలీసులతో కలసి దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో అధిక మొత్తంలో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముందుగా రాబడిన సమాచారం మేరకు ఫ్యాక్టరీ నుండి ఓ కంటైనర్ లో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా నిల్వ ఉంచిన 56 లక్షల రూపాయల నగదును ఎన్నికల అధికారులు పక్కా స్కెచ్ తో స్వాధీనం చేసుకున్నారు.రాయల్ మెరైన్ ఫ్యాక్టరీ బాపట్ల అసెంబ్లీ టిడిపి అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మ కు చెందినది కావడంతో ఆడబ్బు ఆయనకు చెందినదిగా అధికారులు భావిస్తున్నారు.చీరాల డిఎస్పీ బేతపూడి ప్రసాద్,రూరల్ సిఐ నిమ్మగడ్డ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో భారీ మొత్తంలో నగదును దొరికి నట్లు సమాచారం.. అయితే అధికారులు మాత్రం 56 లక్షలు మాత్రమే దొరికినట్లు చెబుతున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు.
===============

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *