సిరా న్యూస్,అదోని;
ఆదోని రైల్వేస్టేషన్ సమీపంలో 37లక్షల రూపాయలు నగదు స్వాధీనo చేసుకున్నట్లు తెలిపిన డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు..స్థానిక ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ ఫ్లయింగ్ స్క్వాడ్ 2 టీం నాగేంద్ర వారి బృందం,టూ టౌన్ సిఐ గోపీ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలలో మల్లికార్జున అనే వ్యక్తి సరైన పత్రాలు లేకుండా బ్యాగులో 37 లక్షల రూపాయల నగదును తీసుకోని వెళ్తుండగా అనుమానంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. తనిఖీలో దొరికిన నగదును ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ కు అందచేస్తామని తెలిపారు.
=======