సిరా న్యూస్, చిగురుమామిడి
భవనాల నిర్మాణాలకు తోడ్పాటునందించాలి
* సంఘం నాయకులు
* కుల సంఘాల భవనాలకు భూమి పూజ
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలోని యాదవ, మున్నూరుకాపు కుల సంఘాల భవనాలకు మంగళవారం భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాలకు చిగురుమామిడి ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి, జడ్పిటిసి గీకురు రవీందర్ ముఖ్య అతిథులుగా హాజరై కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈసందర్భంగా యాదవ, మున్నూరు కాపు సంఘం నాయకులు మాట్లాడారు. భవనాల నిర్మాణం ఎంతో ఖర్చుతో కూడుకున్న దృష్ట్యా…హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లి ఆర్థిక సహాయాన్ని అందించేలాగా చూసి భవనాల నిర్మాణానికి తోడ్పాటు అందించాలన్నారు.ఎంపీపీ, జడ్పిటిసి మాట్లాడుతూ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆర్థిక సాయం అందేలాగా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం అధ్యక్షుడు కత్తుల రమేష్, బండి సేరలు,మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు తోట శ్రీనివాస్, మిట్టపల్లి మల్లేశం, కంది శంకర్, గంప తిరుపతి, మాజీ ఉపసర్పంచ్ పెండ్యాల శారద సదానందం, దాసరి ప్రవీణ్ కుమార్, కార్యదర్శి రమణారెడ్డి, మాచమల్ల కిషోర్, మెడబోయిన తిరుపతి, సత్యం రెడ్డి, పడమడకల రాజిరెడ్డి,కంది తిరుపతిరెడ్డి, మాచమల్ల రమణయ్య, కత్తుల దేవేందర్,కత్తుల ప్రశాంత్,గంప మదుమోహన్, బండి సందీప్, కొంకట బిక్షపతి,కత్తుల ప్రవీణ్, మిట్టపల్లి ఆదర్శ్, బండి ప్రశాంత్ , ముత్యాల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.