కలకలం రేపుతున్న వేణుస్వామి కామెంట్స్

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా కొనసాగలేరా.. అంటే అవుననే అంటున్నారు సెలబ్రిటీ జోతిష్కడు వేణుస్వామి. ఆయనకు పదవీగండం ఉందని పేర్కొంటున్నారు. అయితే ఆయనను ఎవరు దించుతారు.. విపక్ష బీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి వస్తుందా.. లేక కాంగ్రెస్‌లో వర్గపోరు మళ్లీ రచ్చకెక్కుతుందా.. అంటే మాత్రం సమాధానం చెప్పడం లేదు. నూతన సంవత్సరం సందర్భంగా సెలబ్రిటీలంతా తమ వేడుకల్లో ఉన్నారు. ఈ సందర్భంగా వేణుస్వామి చేసిన కామెంట్స్‌ ఆసక్తిగా మారాయి. రాజకీయ, సిని సెలబ్రిటీల గురించి కూడా ఆయన ఆసక్తికర విషయాలు తెలిపారు. వచ్చేది క్రోధినామ సంవత్సరం అని, ఈ సంవత్సరం రాజు కుజుడు, మంత్రి శని అని తెలిపారు. ఈ రెండు కూడా ఎక్కువగా చెడు ప్రభావాలు ఇచ్చేవే అని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి పీడిస్తుందని తెలిపారు.కుజుడు, శని రాజు, మంత్రిగా ఉన్నందున ఈ ఏడాది గొడవలు ఎక్కువగా జరుగుతాయని తెలిపారు. భారత దేశంలో ఈ సంత్సరంలో రాష్ట్రాల మధ్య గొండవలు లేదా కేంద్రం, రాష్ట్రాల మధ్య గొండడలు జరుగుతాయని తెలపిఆరు. కేంద్రంలో ఉన్న ప్రముఖ నాయకులకు అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడతారని తెలిపారు.ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో తిరిగి జగన్‌ పార్టీ వైసీపీ అధికారంలోకి వస్తుందని వేణుస్వామి తెలిపారు. జగన్‌ రెండోసారి ముఖ్యమంత్రి అవుతారని వెల్లడించారు. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పదవీ గండం ఉందని తెలిపారు. ఆయన జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ గండం గట్టెక్కితే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తిరుగు ఉండదని షాకింగ్‌ విషయాలు తెలిపారు.తెలంగాణలో పదుల సంఖ్యలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు జైలుకు వెళ్తారని వేణుస్వామి తెలిపారు. తెలంగాణలో ఒక రాజకీయ నాయకుడి వారసుడి వ్యక్తిగత జీవితం సంచలనానికి దారితీసే అవకాశం ఉందని వెల్లడించారు. రాజకీయ నాయకులతోపాటు పలువురు సినీ ప్రముఖులు జాతకాలను కూడా వెల్లడించారు.ఒక ప్రముఖ తెలుగు యాంకర్‌ సమస్యల నుంచి బయట పడుతుందని వేణుస్వామి తెలిపారు. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ హీరో ఒకరు సినిమా ఇండస్ట్రీ నుంచే నిష్క్రమిస్తారని తెలిపారు. ఆరగ్యోపరమైన ఇబ్బందులతో రిటైర్మెంట్‌ ప్రకటిస్తారని తెలిపారు. అంతేకాకుండా బాలీవుడ్‌ హీరోయిన్‌ వ్యక్తిగత విషయాలను వెల్లడించారు. ఒక సంచలన విషయం నుంచి ఆమె బయట పడుతుందని తెలిపారు.ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా ఉంటాయని వేణుస్వామి వెల్లడించారు. మునుపటికంటే ఎక్కువ స్థాయిలో తీవ్ర భూకంపాలు వస్తాయని తెలిపారు. అగ్ని పర్వతాలు బద్ధలవుతాయని, అతివృష్టి లేదా అనావృష్టి ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. ఇవన్నీ పూర్తిగా ఏడాదిలో జరుగుతాయని తెలిపారు. త్వరలోనే రాశులకు సంబంధించి ఎలాంటి మార్పులు ఉంటాయో తెలియజేస్తానని పేర్కొన్నారు. వాటిని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *