వైభవంగా యేసు క్రీస్తు పుట్టినరోజు వేడుకలు

సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాలలో వైభవంగా యేసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరిగే క్రిస్మస్ పండుగను నంద్యాల జిల్లాలో అంగరంగ వైభవంగా క్రిస్మస్ పండుగ వేడుకలు జరుగుతున్నాయి.118 సంవత్సరాల చరిత్ర కలిగిన హోలీక్రాస్ కేథడ్రాల్ చర్చ్ లో భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ పండుగ ప్రార్ధనలు జరుపుతున్నారు. రాయలసీమ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన చర్చిలలో ఒకటైన నంద్యాల హోలీ క్రాస్ కెథడ్రల్చర్చ్ పేరుగాంచింది. 118 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాముఖ్యమైన చర్చిగా ప్రసిద్ధ చెందింది. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డయాసిస్ ఆఫ్ నంద్యాల అధ్యక్ష ఖండం ఆధ్వర్యంలో ఈ చర్చ్ నిర్వహణజరుగుతుంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా వేల సంఖ్యలో ప్రార్థనల్లో క్రైస్తవులతో కలిసి,నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *