సిరా న్యూస్,రామడుగు
చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం గోపాల్ రావు పేట గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గురువారం శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి 197వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా కో- కన్వీనర్ దాసరి రవి శాస్త్రి మాట్లాడుతూ సమ సమాజంలో కుల వివక్ష అంటరానితనంపై పోరాటం చేసి వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు హక్కులు మహిళలకు విద్య అవకాశం కల్పించిన గొప్ప సంఘసంస్కర్త శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే అని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షులు రేణికుంట అశోక్ ఉపాధ్యక్షులు దాసరి అనిల్ ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా కో- కన్వీనర్ దాసరి రవిశాస్త్రి ఏఎంసీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూడూరి మణెమ్మ మల్లేశం అంబేద్కర్ సంఘం మాజీ ప్రెసిడెంట్ రేణికుంట రాజు ఆర్టిస్ట్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు దాసరి కనకయ్య ప్రిన్సిపాల్ ఇందుర్తి ప్రవీణ్ దళిత నాయకులు తడగొండ మల్లేశం సంఘ సభ్యులు లింగంపల్లి రవి వేల్పుల రవి గంగాధర శ్రీకాంత్ సిపెళ్లి మధు తదితరులు పాల్గొన్నారు.