సిరా న్యూస్,మంథని;
పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో సోమవారం పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.మంథని పట్టణంలో బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి , మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి , ఆయన సతీమణి వసుమతి మంథని పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటుకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూడిద తిరుపతి తన స్వగ్రామమైన మంథని మండలం నాగారంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.