సిరా న్యూస్, కరీంనగర్:
సింగరేణి బొగ్గు గనుల వేలం పాటను రద్దు చేయాలి : సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి
* కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఎదుట ధర్నా
సింగరేణి బొగ్గు గనుల వేలం పాటను వెంటనే రద్దు చేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి అన్నారు.
కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎం.ఎల్ ప్రజా పంథామాస్ లైన్ పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంను వెంటనే రద్దు చేయాలని, బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకి అప్పగించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి వెంకటస్వామి, మంద పనవ్, సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి, సీపీఐఏం ఎల్ ప్రజా పంథా మాస్ లైన్ జిల్లా నాయకుడు జిందం ప్రసాద్, సైదాపూర్ మండలా పార్టీ ఇంచార్జ్ మరియు జిల్లా కార్యవర్గ సభ్యుడు బత్తుల బాబు తదితరులు పాల్గొన్నారు.