సిరాన్యూస్,సైదాపూర్:
నర్సింగోజు నర్సయ్య కుటుంబాన్ని పరామర్శించిన చాడ వెంకట్ రెడ్డి
సైదాపూర్ మండలంలోని ఎక్లాస్ పూర్ గ్రామానికి చెందిన నర్సింగోజు నర్సయ్య ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబాన్ని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. నర్సయ్య తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అనంతరం ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంద పవన్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తుల బాబు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠ రెడ్డి, స్థానిక మాజీ సర్పంచ్ కొత్త రాజిరెడ్డి, గుండేటి వాసు , ఎండి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.