Chada Venkata Reddy: బాధిత కుటుంబాలను పరామర్శించిన చాడ వెంకటరెడ్డి

చిగురుమామిడి, సిరా న్యూస్ 

కరీంనగర్ జిల్లా చిరుమామిడి మండల పరిధిలోని ఇందుర్తి గ్రామంలో ఇటీవల మరణించిన కోన రామస్వామి, బుర్ర మురళీకృష్ణ, పల్లపు పద్మ, గుడికందుల రాయమల్లు కుటుంబ సభ్యులను శుక్రవారం సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఇందుర్తి మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి  పరామర్శించారు. ఈ సందర్భంగా వారి మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతకుముందు మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే స్వామి, బోయిని అశోక్, రైతు సంఘం అధ్యక్షులు కాంతాల శ్రీనివాసరెడ్డి, సీపీఐ గ్రామ శాఖ కార్యదర్శి ఎండీ ఉస్మాన్, బింగి స్వామి, తిరుపతి, రామ్ రెడ్డి, కొమురయ్య, సదానందం తదితరులు పాల్గొన్నారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *