Chada Venkata Reddy: ఇండియా కూటమిని గెలిపించాలి : సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి

సిరాన్యూస్, చిగురుమామిడి
ఇండియా కూటమిని గెలిపించాలి : సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి

భారత రాజ్యాంగం పెను సంక్షోభంలో పడుతున్న సందర్భంలో జరుగుతున్న ఈ లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి తో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి ని గెలిపించాలని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంత‌రం వారు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాల్నా…? నియంతృత్వం ఉండాలా..? అని తేల్చుకోవాల్సిన సందర్భం దేశ ప్రజలకు ఏర్పడిందన్నారు. బీజేపీ పాలనలో నిత్యవసర ధరలు పేరిగాయన్నారు. ఇండియా కూటమి గెలిస్తే దేశవ్యాప్తంగా కులగనన చేపడతామని, చట్టసభల్లో వెనుకబడ్డ వర్గాలకు 50శాతం రిజర్వేషన్ కల్పిస్తామని తెలిపారు. బండి సంజయ్ కరీంనగర్ కి 2500 కోట్ల నిధులతో ఎక్కడ అభివృద్ధి చేశాడో చెప్పాలన్నారు. బీజేపీది మతం పేరుతో రాజకీయం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. అనంత‌రం సీపీఐ జిల్లా అధ్యక్షుడు మర్రి వెంకటస్వామి మాట్లాడుతూ బీజేపీ దేశంలో మతకల్లోలలు సృష్టిస్తూ ప్రజల్ని అశాంతి పాలు చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందరావు ను గెలిపించాలని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి నాగేళ్లి లక్ష్మారెడ్డి, సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్, తీరాల సత్యనారాయణ, మాజీ సర్పంచ్ గోలి బాపిరెడ్డి, గూడెం లక్ష్మి,రాజయ్య, జనార్ధన్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత కునచ్చుల మహేందర్,  కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *