సిరా న్యూస్,రంగా రెడ్డి;
రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ జరిగింది. హైదర్ గూడా లోని జనప్రియా ఉటోపియా అపార్ట్మెంట్ వద్ద రోడ్డు పై నిలబడి ఉన్న నిషేతా (30) అనే ఓ మహిళ మెడ నుంచి ఇద్దరు దుండగులు మూడున్నర తులాల పుస్తల తాడి ను లాక్కొని వెళ్లిపోయారు. సుమారు 20 నుండి 25 వయస్సు గల ఇద్దరు దుండగులు ఆక్టీవా పై వెళ్తూ, హైదర్గుడా నివాసి నిశేతా మెడ నుంచి పుస్తల తాడి ను లాక్కొని వెళ్లారు. దీనితో బాధితురాలు పోలీసులకు ఆశ్రయించగా, కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు …