సిరాన్యూస్,ఖానాపూర్
తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు : మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
* మంచినీటి బోరు ఏర్పాటుకు భూమి పూజ
తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ 12వ వార్డులో ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు మంచినీటి బోరు ఏర్పాటుకు మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రతి వార్డులో తాగునీటి బోరును వేయిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి సంతోష్ ,స్థానిక కౌన్సిలర్, నాయకులు షబ్బీర్ పాషా , నాయకులు సలీం ఖాన్ , కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.