సిరాన్యూస్,ఖానాపూర్
ఖానాపూర్ టు హైదరాబాద్ బస్సు ఏర్పాటు : మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం నుండి ప్రజలు హైదరాబాద్ నగరానికి వెళ్లాలంటే బస్సులు లేక ఇబ్బందులు పడుతన్నారు. ఈవిషయం స్థానికులు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మున్సిపల్ చైర్మన్ శనివారం సంబంధిత ట్రావెల్స్ యాజమాన్యంతో మాట్లాడి ఖానాపూర్ పట్టణంలో మంగళవారం నుండి ప్రతిరోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్కు వెళ్లేందుకు బస్సును ఏర్పాటు చేయించారు. బస్సు ఖానాపూర్ పట్టణం నుండి హైదరాబాద్ లోని సికింద్రాబాద్, బేగంపేట్, అఫ్జల్గంజ్, వెళ్లి మళ్లీ రాత్రి 10 గంటలకు హైదరాబాద్ నుండి ఖానాపూర్ కు వస్తుందని తెలిపారు. చావరియ ట్రావెల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కావలి సంతోష్ , నాయకులు నాగభూషణం , చావరియా ట్రావెల్స్ యాజమాన్యం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.