Chairmen Boddu Ganga Reddy: బొడ్డు గంగారెడ్డికి ఘన సన్మానం

సిరా న్యూస్, బోథ్‌:

బొడ్డు గంగారెడ్డికి ఘన సన్మానం

ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ బొడ్డు గంగారెడ్డిని స్థానిక నాయకులు, అధికారులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. మంగళవారం మండల కేంద్రంలోని మార్కెట్‌ యార్డ్‌లో నిర్వహించిన శనగల కొనుగోలు కార్యక్రమంలో ఆయన్ను సన్మానించారు. మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బొడ్డు గంగారెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో చైర్మెన్‌ బాధ్యతలు అప్పగించినందుకుగాను ధన్యవాదాలు తెలిపారు. మార్కెట్‌ అభివృద్ధి, రైతు సంక్షేమమే ధ్యేయంగా తన సేవలందిస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటీసీ డా. సంధ్యారాణి, ఎఎంసీ కార్యదర్శి నార మనోహర్,  సొసైటీ సీఈవోలు నాగభూషణ్, గోలి స్వామి, కో ఆప్షన్‌ సభ్యులు తాహేర్‌ బిన్‌ సలీం, ఎంపీటీసీ కుర్మే మహేందర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *