మంథని ఆర్డీవో హనుమ నాయక్.
సిరా న్యూస్,కమాన్ పూర్;
వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకే కమాన్ పూర్ మండల తహసిల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని మంథని ఆర్డీవో హనుమా నాయక్ అన్నారు. బుధవారం తహసీల్ కార్యాలయం వద్ద తహసిల్దార్ ఆరిపోద్ది న్ డిప్యూటీ తాసిల్దార్ సుదాటి కోటేశ్వరరావు తో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ వేసవిని దృష్టిలో పెట్టుకొని కార్యాలయాలకు వచ్చే రైతులు ప్రజలు దారి గుండా వెళ్లే ప్రజల కోసం దాహార్తి తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల వద్ద చలివేంద్రాలు ప్రారంభించాలని కోరారు. గిరిధవార్లు సంధాని రవీందర్ సీనియర్ అసిస్టెంట్ కే మహేష్ బాబు జూనియర్ అసిస్టెంట్ మల్కా రెడ్డి రంజిత్ కృష్ణ రాజేందర్ చిరంజీవి శ్రీనివాస్ ధరణి ఆపరేటర్ నగేష్ కార్యాలయ ఆపరేటర్ తోట రమేష్ మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.