శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానం ఉరుకుంద
సిరా న్యూస్,కౌతాళం;
శ్రీ స్వామి వారి దర్శనార్థం వచ్చు యాత్రికులకు, భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ద్వారా గురువారము ఉదయం 11 గంటలకు దేవస్థాన ఉత్తర రాజగోపురం ముందు భాగమున “చలివేంద్రం” ఏర్పాటు చేయడమైనది., మరియు దేవస్థాన నిత్యాన్నదానశాలయందు పత్తికొండ వాస్తవ్యులు బి .ఈ శ్రీనివాసులు ధర్మపత్ని మాణిక్యాంబ మరియు బి ఈ మదన గోపాల్ ధర్మపత్ని కవిత వారి కుటుంబసభ్యుల దాతృత్వముచే భక్తుల సౌకర్యార్థము రూ.50000/-లు విలువ కలిగిన ” వోల్టాస్ వాటర్ కూలర్” ఏర్పాటు చేయడమైనది.. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఉప కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి హెచ్ జే వెంకటేశ్ దేవస్థానం పర్యవేక్షకులు జె.కె మల్లికార్జున, కె.వెంకటేశ్వర రావు, రామ్మోహన్ రావు గారు మరియు ఆలయ అర్చక సిబ్బంది పాల్గొన్నారు.
=======================