దెందులూరులో వైసిపి, టీడీపీ నేతల సవాళ్లు..ఉద్రిక్తత

సిరా న్యూస్,దెంగులూరు;
పెదవేగి దాడుల ఘటన తర్వాత దెందులూరు మండలం సోమవరప్పడులో టిడిపి వైసిపి శ్రేణులు ఒక్కసారిగా ఎదురుపడ్డారు.
“బాబు షూరిటీ” కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి సోమవరప్పాడులో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సహా పలువురు టిడిపి నాయకులు పాదయాత్రగా పర్యటించారు.
అదే సమయంలో వైకాపా నేతలు కాన్వాయ్ తో అటుగా వచ్చారు. కాన్వాయ్ ఆపి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. సోలీసులు వారిని వారించినా వినలేదు. కాన్వాయ్ లోనే ఉన్న వైసిపి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సలహతోనే కవ్వింపు చర్యలు పాల్పడ్డారని టిడిపి నాయకుల ఆరోపణ. దాంతో వాగ్వాదం మోదలయింది. వాహనాలు దిగి వస్తే చూసుకుందాం అంటూ టిడిపి నాయకుల సవాళ్లు విసిరారు. తరువాత వైకాపా నేతలు వెళ్లిపో్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *