Challuri Raju: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మ‌క్కయ్యాయి

సిరాన్యూస్, సైదాపూర్:
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మ‌క్కయ్యాయి
*సోషల్ మీడియా కన్వీనర్ చల్లూరి రాజు

బీజేపీ, కాంగ్రెస్ రెండులు పార్టీలు కుమ్మ‌క్కయ్యాయ‌ని సోషల్ మీడియా కన్వీనర్ చల్లూరి రాజు అన్నారు. గురువారం సైదాపూర్ మండ‌లంలోని గోడిశాల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సమావేశం నిర్వహించారు. ఈసంద‌ర్భంగా సోషల్ మీడియా కన్వీనర్ చల్లూరి రాజు మాట్లాడారు. కేసీఆర్ విజ‌యాన్ని అడ్డుకోవ‌డానికే బ‌స్సుయాత్ర నిలిపివేశార‌ని ఆరోపించారు. పార్లమెంట్ ఎలక్షన్స్ లలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యాత్రకు తెలంగాణలో అమాంతం అనూహ్య స్పందన వచ్చి సర్వేల్లో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉన్నట్లు తెలవడంతో బీజేపీ ,కాంగ్రెస్ పార్టీలు కుమ్మకై కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *