వైసిపి మేనిఫెస్టోలో కొన్ని అంశాలను చేర్చాలని సలహా ఇచ్చిన రిటైర్డ్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ చంద్ర శేఖర్ రెడ్డి

 సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాల పట్టణంలోని తన కార్యాలయంలో రిటైర్డ్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేస్తున్న మేనిఫెస్టోలో తను సూచనలు,సలహాలు సిఎం జగన్ మోహన్ రెడ్డి కి నచ్చితే మేనిఫెస్టోలో చేర్చాలని కోరారు.అయిదు ఎకరాల పొలం ఉన్న సన్నకారు రైతులకు రెండు లక్షల వడ్డీ లేని రుణం ఇచ్చి 30 నెలల లోపల చెల్లించే విధముగాను ఉండాలని,కట్టని యెడల వడ్డీతో సహా కట్టేవిధంగా,అలాగే 10 ఎకరాల పొలం ఉన్న రైతులకు రూ.3 లక్షల వడ్డీ లేని రుణమును మంజూరు చేసి,తిరిగి 30 నెలల లోపల ఋణాన్ని కట్టని యెడల వడ్డీతో సహా కట్టవల్సి ఉంటుందని,అదే విదంగా దళితులకు నాల్గవ తరగతి ఉద్యోగస్తులకు,చేతి వృత్తి పనుల వారికి,మహిళలకు రూ.50 వేల ఋణమును మంజూరు చేయాలి.ఆ ఋణమును 20 నెలల లోపల తిరిగి చెల్లించన యెడల వడ్డీతో సహా కట్టవలసి వస్తుంది.కాబట్టి ఈ అంశాలు సిఎం జగన్ మోహన్ రెడ్డికి నచ్చితే నేడు విడుదల చేస్తున్న మేనిఫెస్టోలో ఈ చేర్చాలని కోరారు.
==========================x

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *