చంద్రబాబువి అన్ని డ్రామాలు

చంద్రబాబు అనేక తప్పులు చేశారు

మాల మాదిగల మధ్య చిచ్చుపెట్టారు
చంద్రబాబుతప్పులు చేయలేదని ఇప్పటికీ ఏ కోర్టు చెప్పలేదు

అనారోగ్య కారణాలు చెప్పి బెయిల్ పై బయటికి వచ్చారు

చంద్రబాబుకు ప్రతి రాజకీయ పార్టీలో కోవర్టులు ఉన్నారు

జగన్మోహన్ రెడ్డి నమ్మకస్తులు సమర్తులకు అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలి

రాష్ట్ర మంత్రి నారాయణస్వామి

సిరా న్యూస్,బద్వేలు;
తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడువి అన్ని నాటకాలని రాష్ట్ర మంత్రి నారాయణస్వామి దుయ్యబట్టారు సోమవారం బద్వేల్ లో జరిగిన సామాజిక
సాధికారికత బస్సు యాత్రలో పాల్గొన్న మంత్రి నారాయణస్వామి విలేకరుల సమావేశంలో మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక తప్పులు చేశారు ఆ తప్పులు కప్పిపుచ్చుకోనేందుకు అనేక నాటకాలు వేస్తున్నారు ఇప్పటివరకు చంద్రబాబు ఏ తప్పు చేయలేదని ఏ ఒక్క కోర్టు కూడా చెప్పలేదు ఆరోగ్య కారణాలు సాకుగా చూపించి బెయిల్ పై బయట తిరుగుతున్నారు చంద్రబాబును నమ్మిన ఏ ఒక్కరు కూడా బాగుపడినట్లు చరిత్రలో లేదు నాకు 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉందని గొప్పలు చెప్పుకోవడమే తప్ప ప్రజలకు చేసిందంటూ ఏమీ లేదని ఆయన ఆరోపించారు చంద్రబాబు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత బాబు గ్రాఫ్ బాగా పెరిగిందని తెలుగుదేశం పార్టీకి భారీ స్థాయిలో ఓట్లు వస్తాయని ప్రజలు అనుకోవడం కేవలం అద్భుత కల్పన అని మంత్రి నారాయణస్వామి దుయ్యబట్టారు చంద్రబాబుకు ప్రతి రాజకీయ పార్టీలో కోవర్ట్ లు ఉన్నారని వైసీపీలో కూడా చంద్రబాబు
కోవర్టులు ఉన్నట్లు మంత్రి తెలిపారు జగన్మోహన్ రెడ్డి సమర్ధులు కాబట్టి తమ పార్టీలో ఉన్న కోవర్టు లను ఎప్పటికి అప్పుడు గుర్తించి వారిని దూరంగా ఉంచుతున్నట్లు తెలిపారు మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి పాలన లోనే
అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతున్నట్లు తెలిపారు జరగబోయే ఎన్నికల్లో నమ్మకస్తులు సమర్ధులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ టికెట్లు ఇవ్వాలని కోరారు జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలను ప్రేమిస్తాడని తెలిపారు పేద ప్రజల సంక్షేమం కోసం అర్హులైన వారికి నేరుగా వారి వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు తెలిపారు మాట తప్పడం మడమ తిప్పడం
జగన్మోహన్ రెడ్డికి చేతకాదు అన్నారు మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా నవరత్నాలు కచ్చితంగా అమ్మలు పరుస్తున్నట్లు తెలిపారు మ్యానిఫెస్టోను ముఖ్యమంత్రి భగవద్గీత కురాన్ బైబిల్ లాగా ప్రార్థిస్తారని తెలిపారు తెలుగుదేశం పార్టీ హయాంలో అర్హులు కూడా సరైన న్యాయం జరగలేదని ఆరోపించారు చంద్రబాబు నాయుడును నమ్మితే అదో గతి అని ఆరోపించారు సామాజిక న్యాయం ఒక్క జగన్మోహన్ రెడ్డి వల్లనే సాధ్యం అవుతుందని ఆయన తెలిపారు ఇంకా పలు విషయాల గురించి మంత్రి నారాయణస్వామి మాట్లాడారు విలేకరుల సమావేశంలో వైకాపా ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా కడప మేయర్ సురేష్ బాబు ఎమ్మెల్సీలు ఇషాక్ భాష రమేష్ యాదవ్ కూడా చైర్మన్ సింగ సాని గురు మోహన్ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి సగర సంగం చైర్మన్ రమణమ్మ గిద్దలూరు పరిశీలకులు బంగారు సీనయ్య బద్వేలు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సాయి కృష్ణ గోపవరం మండల మాజీ అధ్యక్షురాలు సరస్వతి పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *