శ్రీవారి సేవలో చంద్రబాబు

సిరా న్యూస్,తిరుమల;
ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆయనకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ ఉన్నారు. వైకుంఠ క్యూకాంప్లెక్స్ వద్ద చంద్రబాబును చూసేందుకు భారీగా టీడీపీ కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. వారికి అభివాదం చేస్తూ ఆయన ముందుకు ఆలయంలోకి ప్రవేశించారు. అనంతరం శ్రీవారి సేవలో పాల్గొన్నారు.===

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *