సంచార జాతుల మద్దతు చంద్రబాబుకే

సిరా న్యూస్,విజయవాడ;
గత ఎన్నికల ముందు అనేక హామీలిచ్చిన జగన్ రెడ్డి, గద్దినెక్కిన తర్వాత సంచార జాతుల నోట్లో మట్టి కొట్టాడని రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి వెంకట గురుమూర్తి విమర్శించారు. జగన్ రెడ్డి పాదయాత్రలో సంచార జాతర (ఎంబీసీ) వారికి శాసనమండలి సభ్యుని అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చి హామీని తుంగలో తొక్కాడన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పట్లో చురుకుగా కార్యకలాపాలు సాగించిన ఎంబీసీ కార్పొరేషన్ ను జగన్ రెడ్డి నిర్వీర్యం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంబీసీ వారికి ఉపాధి కొరకు ప్రభుత్వం నుండి 30 వేల రూపాయలు ఉచితంగా సహాయం చేయడం జరిగిందని, సంచార జాతుల వారికి 100 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని కూడా జగన్ గాలికి వదిలేసాడని విమర్శించారు.
ఎస్సీ ఎస్టీ వారి మాదిరిగా ఎంబిసి వారికి కూడా అట్రాసిటీ యాక్ట్ తీసుకువస్థానని జగన్ రెడ్డి హామీ ఇచ్చాడని, ఈ పథకాలన్నీ కూడా జగన్ రెడ్డి అమలు చేయకుండా ఎంబీసీ వారి ఆర్థిక ఎదుగుదలను అణగతొక్కాడని అన్నారు. కృష్ణా జిల్లాపార్టీ కార్యాలయంలో జరిగిన సంచారజాతుల ముఖ్య నాయకు ల సమావేశంలో వీరంకి వెంకట గురుమూర్తి మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో ఎంబీసీ కార్పొరేషన్ కి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా, పేరుకే కార్పొరేషన్ ఏర్పాటు చేసి సొంత పార్టీ వారికి రాజకీయ ఉద్యోగం కల్పించాడని, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తన ఆర్భాటం కోసం పదవి పేరు చెప్పుకొని తిరుగుతాడే తప్ప కులాలకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందన్నారు.ప్రభుత్వాన్ని నిధులు అడగకపోగా అవినీతిపై దృష్టి పెట్టాడని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో సంచార జాతుల వారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికి, తిరిగి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుదలకు దోహదపడుతుందని,… సైకో జగన్ రెడ్డిని గద్దె దింపడమే లక్ష్యంగా ఎంబీసీ నాయకులందరు కలిసి కట్టు గా పని చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్త నాగేంద్రబాబు, రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గంజం రాఘవేంద్రరావు,రాష్ట్ర ఎంబిసి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *