పివి రమేష్ ట్వీట్ ను రిట్వీట్ చేసిన చంద్రబాబు

 సిరా న్యూస్,అమరావతి;
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చేసిన ట్వీట్ ను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రీట్వీట్ చేసారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు తానే ప్రత్యక్ష బాధితుడిని అంటూ పీవీ రమేష్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కృష్ణా జిల్లా, విన్నకోట గ్రామంలో తన తల్లిదండ్రులకు చెందిన భూముల మ్యుటేషన్ కు తాను ఇబ్బంది పడ్డానని రమేష్ అన్నారు. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఏపీకి సేవలందించిన తన పరిస్థితే ఇలా ఉందంటే సామాన్యుల దుస్థితిని ఊహించలేం అంటూ పీవీ రమేష్ ట్వీట్ లో పేర్కోన్నారు. జగన్ సీఎంఓలో పనిచేసిన ఐఏఎస్ అధికారి పరిస్థితే ఇలా ఉంటే..ఇక సామాన్యుడి పరిస్థితి ఊహించండి అంటూ చంద్రబాబు ట్వీట్ చేసారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే మీ భూమి, మీ ఇళ్లు, మీ స్థలం, మీ పొలం మీది కాదంటూ ట్వీట్ చేసారు చంద్రబాబు
====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *