కొడాలి నాని
సిరా న్యూస్,విజయవాడ;
టిడిపి బీసీ సదస్సుపై ఎమ్మెల్యే కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కార్యక్రమాలు అమలు చేయడం తప్ప, బీసీల కోసం చంద్రబాబు ఏం పాటుపడ్డాడని నిలదీసారు. ఓసి రిజర్వుడు స్థానాల్లో బీసీలకు పదవులిచ్చిన ఘనత సీఎం జగన్ ది. అధికారంలో ఉన్నప్పుడు గాలికి వదిలేసి…. ఇప్పుడు బీసీ భజన చేస్తే ఎవరూ నమ్మరు. పవన్ కళ్యాణ్ ను వెనకాల పెట్టుకొని తిరుగుతున్న చంద్రబాబు, బీసీలు వెన్నెముక్క అని ఎలా చెప్తారు. కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్, విజయవాడ మేయర్ బీసీలకు ఇవ్వడమే జగన్ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు.
సీఎం జగన్ నాలుగు రాజ్యసభలు బీసీలకు ఇస్తే,25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు ఒక్క బీసీ కైనా రాజ్యసభ ఇచ్చారా అని ప్రశ్నించారు.
విద్యా,వైద్యం పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవడంతో పాటు బీసీల ఆర్థిక ఉన్నతకి సీఎం జగన్ అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని బీసీ ,ఎస్సీ ,ఎస్టీ మైనార్టీలను, వదిలేసి పవన్ కళ్యాణ్ ను వెంటేసుకుని తిరుగుతున్న చంద్రబాబుకు 2019లో పట్టిన గతే తిరిగి పడుతుందని అన్నారు