Chandramohan: గుడుంబా కేసులో ఓ మహిళకు 50 వేల జరిమానా

సిరాన్యూస్‌, భీమదేవరపల్లి
* గుడుంబా కేసులో ఓ మహిళకు 50 వేల జరిమానా
* గుడుంబా అమ్మకాలు స్వచ్ఛందంగా ఆపకపోతే కఠిన చర్యలు
*  ఎక్సైజ్ సీఐ చంద్రమోహన్

భీమాదేవరపల్లి మండలంలోని ముల్కనూరు వడ్డెర కాలనీకి చెందిన ఓ మహిళకు నిషేధిత గుడుంబా అమ్ముతున్న కారణంగా 50 వేల జరిమానా విధించినట్టు కాజీపేట ఎక్సైజ్ సిఐ చంద్రమోహన్ తెలిపారు. వివరాల్లోకి వెళితే… ముల్కనూర్ వడ్డెర కాలనీకి చెందిన గొల్లెన రజిత అనే మహిళ గతంలో గుడుంబా కేసులో పట్టుబడగా, స్థానిక ఎమ్మార్వో ఎదుట బైండోవర్ చేశారు. ఎమ్మార్వో ముందు ఇకపై గుడుంబా అమ్మినట్లయితే 50 వేల జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించవలసిందిగా స్వయంగా బైండోవర్ కావడం జరిగింది. అయితే కొంతకాలానికి సదరు మహిళ స్థానిక ఎక్సైజ్ అధికారులకు గుడుంబా అమ్ముకుంటూ దొరకగా, ఆమెను పరకాల సబ్ జైలుకు రిమాండ్ చేశారు. అనంతరం బ్రీచ్ కేస్ నమోదు చేసి స్థానిక ఎమ్మార్వో ప్రవీణ్ ఎదుట హాజరు పరిచారు. ఆమెకు 50 వేల రూపాయల జరిమానా విధించినట్లు, ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయించినట్లు ఎక్సైజ్ సిఐ చంద్రమోహన్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ముల్కనూరు వడ్డెర కాలనీలో ఇంకా కొంతమంది ఎక్సైజ్ అధికారుల కన్ను కప్పి గుడుంబా విక్రయాలు కొనసాగిస్తున్నారని, వారి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. వారిపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారు స్వచ్ఛందంగా గుడుంబా అమ్మకాలు మానుకోవాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సై మమత, హెడ్ కానిస్టేబుల్ ఖలీల్, కోటి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *