చర్లలో క్షుద్ర పూజల కలకలం

సిరా న్యూస్,భద్రాద్రి;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. అర్థరాత్రి వేళల్లో ఇల్ల ముందు గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేస్తున్నారని సమాచారం.. కుంకుమ, పసుపు బియ్యం, కోడిగుడ్లు, వెంట్రుకలతో పూజలు జరిపారు. ఉదయం ఇంటి ముందుకు వచ్చి చూడగా క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వరుసగా రెండు రోజులు రెండు ఇల్ల ముందు పూజలు జరిగాయి. పోలీస్ శాఖ నిఘా పెట్టి ఇటువంటి పూజలు చేసేవారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
=====

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *