సిరాన్యూస్, గుడిహత్నూర్
గుడిహత్నూర్ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శిగా చాటే సంబాజీ
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శిగా గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన చాటే సంభాజీ ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా చాటే సంబాజీ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా అధ్యక్షులు పతంగే బ్రహ్మానంద్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, గుడిహత్నూర్ మండల అధ్యక్షులు కేంద్రే శివ లకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చెయ్యడానికి కృషి చేస్తానని, కొత్త పాత అని ఎలాంటి భేదాభిప్రాయాలూ లేకుండా అందరిని కలుపుకుంటూ పోతా నని, సీనియర్ నాయకుల సలహాలు సూచనలు తీసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తానని అన్నారు.ఇది కార్యకర్తలకి దక్కిన గౌరవమని అన్నారు. పార్టీ కోసం పనిచేసే వారిని పార్టీ గుర్తుంచుకుంటుందని చెప్పడానికి తానే ఒక ఉదాహరణ అని తెలిపారు.