సిరా న్యూస్, కళ్యాణదుర్గం
చౌడేశ్వరి ఆలయంలో హుండీ చోరీ
కళ్యాణదుర్గంలో మండలంలోని మల్లిపల్లి గ్రామంలో గల చౌడేశ్వరి దేవి ఆలయంలో ఆదివారం రాత్రి హుండీ చోరీ జరిగింది. వివరాలు ఇలా… కళ్యాణదుర్గం మండలంలోని మల్లిపల్లి గ్రామంలో ఉన్న చౌడేశ్వరి దేవి ఆలయంలో దుండగులు వెండి ఆభరణాలతో పాటు అమ్మవారి హుండీని దోచుకెళ్లారు. దొంగలు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి చోరీ చేసినట్లు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంత నగదు దోచుకెళ్లారో పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.