కేసీఆర్ దే చీటింగ్ పెటెంట్ రైట్

సిరా న్యూస్,జగిత్యాల;
చక్కర కర్మాగారం తెరిపించేందుకు జనవరి నెలలో మన ప్రారంభానికి సంబంధించిన ప్రక్రియ మొదలవుతుందని, వస్తున్న చక్కర కర్మాగారాన్ని మూసివేసి టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలం చెందిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.. చీటింగ్ కు పెంటేంట్ రైట్ ఉందంటే అది కేవలం కేసీఆర్ కే ఉంటుందని ఎద్దేవా చేశారు. కోరుట్ల శివారులో ఉన్న వెటర్నరీ కాలేజీకి జువ్వాడి రత్నాకర్ రావు పేరును పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు దానికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులను 420గా అభివర్ణించడం విడ్డూరంగా ఉందని ,ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి అమలు చేయని వాళ్ళు 420 గా అభివర్ణిస్తారని అలా చేయలేని నిజమైన ఫోర్ ట్వంటీ కెసిఆర్ అని ఎద్దేవా చేశారు,రేవంత్ రెడ్డి చెప్పినదాని ప్రకారం చక్కర కర్మాగారం పునర్ ప్రారంభం కోసం కమిటీ వేసి ప్రక్రియ ప్రారంభించేందుకు ముందుకెళ్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి 30 రోజులు కూడా గడవకముందు అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తున్నారని బిఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు 2014 తెలంగాణ రాకముందు బీడీ కార్మికులు గా గుర్తింపు పొందిన వారికి మాత్రమే ఇప్పటివరకు పెన్షన్ ఇచ్చారని ఇది మరి దౌర్భాగ్యమైన చర్యగా భావిస్తున్నట్టు తెలిపారు ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ వచ్చే విధంగా చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణంలోని ఐదుగురు కౌన్సిలర్లు అలాగే మునిసిపల్ వైస్ చైర్మన్ గడ్డమీద పవన్ తో పాటు పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *