సిరా న్యూస్, భీమదేవరపల్లి
బీజేపీకి బహుజనులు ఓట్లు ఎందుకు వేయాలి..?
* తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్
భారత రాజ్యాంగాన్ని మారుస్తామన్న బిజెపికి బహుజనుల ఓట్లు ఎందుకు వేయాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశంలో బిజెపి పది సంవత్సరముల పరిపాలనలో దళిత బహుజనుల పైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన దాడులు, దౌర్జన్యాలు,హత్యలు, మానభంగాలు అనేకం జరుగుతూనే ఉన్నాయని అన్నారు. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మతపరమైన అల్లర్లు సృష్టిస్తూ జనాన్ని భయాందోళనకు గురి చేస్తున్నారు మణిపూర్ సంఘటనలో బిజెపి ప్రభుత్వం ఇప్పటివరకు ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. భారతదేశ వ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో దళితుల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి, భారత రాజ్యాంగాన్ని మారుస్తామన్న బిజెపి ప్రభుత్వానికి దళిత బహుజనులు వ్యతిరేకించి బిజెపికి తగిన ఓటుతో బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మారుస్తామన్న నియంత పోకడలు విరమించుకోవాలని పేర్కొన్నారు. లేని పక్షంలో ఈ దేశంలో ఉన్న బహుజనులంతా ఏకతాటిపైకి వస్తే బిజెపి ప్రభుత్వం మట్టి కరిచిపోవడం ఖాయమనిహెచ్చరించారు. బిజెపి ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో దళితుల ఇండ్లలోకి పోయి భోజనం చేసి భోజనానికి తగిన సామాగ్రిని బువ్వ నీళ్లు దుప్పట్లు ముందస్తుగా తీసుకొని పోయి దళితుల ఇండ్లల్లో నిద్రించడం ఏంటి అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇటువంటి కార్యక్రమాలు మానుకొని రాజ్యాంగాన్ని మార్చేస్తాం రాజ్యాంగ పీఠిక నుంచి లౌకికవాదం అన్నమాటను తొలగిస్తాం కర్ణాటక సీనియర్ నేత ఎంపీ ఆనంత హెగ్డే వాక్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. కార్యక్రమములో తెలంగాణ అంబేద్కర్ సంఘం మండల కన్వీనర్ బొల్లంపల్లి రాజు, కోకన్వీనర్ కొమ్ముల రవీందర్, అంబాల రాజ్ కుమార్, కొయ్యడ రమేష్ తదితరులు పాల్గొన్నారు.