Chepyala Prakash: రాజ్యాంగం జోలికొస్తే రాజకీయంగా సమాధి చేస్తాం

సిరా న్యూస్, భీమదేవరపల్లి
రాజ్యాంగం జోలికొస్తే రాజకీయంగా సమాధి చేస్తాం
* తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్
* అనంత కుమార్ హెగ్డే దిష్టిబొమ్మ దహనం
భారత రాజ్యాంగం జోలికొస్తే రాజకీయంగా సమాధి చేస్తామ‌ని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ అన్నారు. మంగ‌ళ‌వారం తెలంగాణ అంబేద్కర్ సంఘం భీమదేవరపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో అనంత కుమార్ హెగ్డే దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈసంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడారు. రాజ్యాంగం ద్వారానే ఆరుసార్లు ఎంపీగా గెలిచి పది సంవత్సరాలుగా బిజెపి కేంద్రంలో అధికారాన్ని చలాయిస్తూ రాజ్యాంగం వల్ల మీకు ఏ నష్టం జరిగింది అని రాజ్యాంగాన్ని మారుస్తామని కుట్రలు చేయడాన్నీ తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. బిజెపి ఎంపీ అనంత కుమార్ హెగ్డే పై దేశద్రోహం చట్టం కింద కేసు పెట్టి నరేంద్ర మోడీ నైతిక బాధ్యత వహించి చట్టపరంగా శిక్షించాలన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంటరీ వ్యవస్థ ప్రజాస్వామ్యం లౌకికవాదం వర్ధిల్లుతూ ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల్లో అగ్రస్థానంలో భారత్ వెలుగొందుచున్నది భారత ప్రజల అభివృద్ధికి అని పాలకుల పాలనకు రాజ్యాంగం ఏమి అడ్డు వచ్చిందని. మారుస్తామంటున్నారన్నారు. ముందుగా దేశ ప్రజలకు బిజెపి సమాధానం చెప్పాలనీ డిమాండ్ చేశారు. రాజ్యాంగ పీఠికలోని లౌకికవాదం తొలగిస్తామన్న హెగ్డే భారత ప్రజల సంస్కృతి స్వేచ్ఛ సమానత్వం దెబ్బతీసే కుట్రలు బిజెపి, ఆర్.ఎస్.ఎస్, బజరంగ్ దళ్ చాప కింద నీరు లాగా దొంగ కుట్రలు చేస్తున్నార‌న్నారు. కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం భీమదేవరపల్లి మండల కన్వీనర్లు బొల్లంపల్లి రాజు .ఎల్తూరి ప్రేమ్ రాజ్. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ . తూముల సదానందం రాష్ట్రా ఆధికార ప్రతి నిధి, దళిత సంఘాల సీనియర్ నాయకులు డేగల సారయ్య తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా కార్యదర్శి తాల్లపెల్లి జగన్ , అంబేద్కర్ మండల కో కన్వీనర్లు కొమ్ముల రవీందర్, దాట్ల రాజు జేరిపోతుల ఐలయ్య , దళిత నాయకులు తాడూరి చిరంజీవి , కండే సుధాకర్, గడిపే చంటి, సుతారి రాజమౌళి, దాట్ల రాజు కుమార్ , ప్రసాద్ . అంబాల తిరుపతి, చిట్కురి అశోక్ , వేముల జగదీష్, ఎదులాపురం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *