Chepyala Prakash: తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపిద్దాం:  తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్

సిరా న్యూస్, భీమదేవరపల్లి
తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపిద్దాం:  తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్

ప్రజా గొంతుక నిరుద్యోగ,ఉద్యోగ సమస్యలపై నిత్యం ప్రశ్నించే గొంతుక మీ తీన్మార్ మల్లన్న ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ అన్నారు. గురువారం భీమదేవరపల్లిలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. తెలంగాణలో పదేళ్లపాటు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చింద‌ని, అదేవిధంగా కేంద్రంలో బీజేపీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మరి పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్,మోడీ లు కాదా అని ఆరోపించారు.అదేవిధంగా మెగా డీఎస్సీ వేస్తానని చెప్పిన కెసిఆర్ గ్రూప్ 1,2 పరీక్షలు పేపర్ లీకేజీ చేసి టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాలను అమ్ముకున్నది బీఆర్ఎస్ పార్టీ తెలిపారు. బీజేపీ ప్రభుత్వంలో ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసి నిరుద్యోవ్యవస్థను పెంచింద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ను,మెగా డీఎస్సీ ఉద్యోగాలు ప్రకటన చేసి నిరుద్యోగులను ఆదుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. పట్టభద్రుల శాసన మండలికి ప్రజల పక్షాన పోరాడే తీన్మార్ మల్లన్న ను భారీ మెజార్టీతో గెలిపించి చట్టసభల్లో పంపాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *