సిరా న్యూస్, భీమదేవరపల్లి
గ్రామ గ్రామాన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవాలి
* తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేప్యాల ప్రకాష్
గ్రామ గ్రామాన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేప్యాల ప్రకాష్ అన్నారు. శనివారం భీమదేవరపల్లి మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎందరో అమరవీరుల త్యాగఫలం, ఉద్యమకారుల ఉద్యమ ఫలితం తెలంగాణను సాధించుకున్నామన్నారు.జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా తెలంగాణ సాధనలో అసువులు బాసిన ప్రతి ఉద్యమ అమరుడికి నివాళులర్పిస్తూ, ఉద్యమ సాధనలో తమ వంతుగా పోరాడిన ప్రతి ఉద్యమ బిడ్డకు,కుల సంఘాల జేఏసీ, తెలంగాణ సమాజం ,ఆర్టీసీ, సింగరేణి ,జర్నలిస్టులు ,ఎన్జీవోలు, రిటైర్డ్ ఉద్యోగులు, కళాకారులు ,ఉపాధ్యాయులు, విద్యార్థులు,దళిత గిరిజన బహుజనుల అందరికీ ఉద్యమ కృతజ్ఞత అభినందనలు తెలిపారు.ముఖ్యంగా తెలంగాణ ప్రజల గుండె చప్పుడు తెలంగాణ వాదానికి వెన్నుదన్నుగా నిలిచి రాష్ట్ర ఏర్పాటులో సహకరించిన రాష్ట్ర ప్రజలందరికీ పేరుపేరునా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.