సిరాన్యూస్, బోథ్
ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
* బస్టాండ్ వద్ద చలివేంద్రం ప్రారంభం
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలములోని పొచ్చర గ్రామంలో శివాజీ మహారాజ్ విగ్రహం వద్ద శివాజీ జయంతి వేడుకలను పొచ్చర గ్రామ శివాజీ సేన ఆధ్వర్యం లో అంగరంగ వైభోగంగా వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ప్రధానోపాద్యాయులు వెంకన్న, ఉపాధ్యాయులు వెంకట రమణ , వీడిసి చైర్మన్ బద్ధం రాజా రెడ్డి, విహెచ్పి ప్రముఖు బిట్లింగు ముత్తన్న ,మాజీ సర్పంచ్ శివాజీ మహారాజ్ కి పూలమాలలు వేశారు.తదనంతరం జరిగిన సభ లో శివాజీ యొక్క చరిత్ర ను విద్యార్థులకి, గ్రామ యువకులకు వివరించడం జరిగింది.శివాజీ జయంతి సందర్భంగా గ్రామ బస్టాండ్ వద్ద చలివేంద్రాన్ని ప్రారంబించారు. కార్యక్రమంలో శివాజీ సేన అధ్యక్షులు కార్తిక్ కొరండ్ల, కార్యదర్శి పద్మ శివ, సభ్యులు శ్రీకర్, చరణ్, హరీష్ కొండ, పొచ్చరెడ్డి అల్లం శేఖర్, ముస్కు నవీన్ రెడ్డి, హరీష్ రెడ్డి, గడ్డం చింటు, వంశీ రెడ్డి, మెరుగు చింటు, అరవింద్, గ్రామస్థులు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.