శుద్ధి లేకుండానే నీటిని సరఫరా చేస్తున్న అధికారులు
త్రాగునీరా లేక బురద నీళ్ల
మండిపడుతున్న గ్రామస్తులు
సిరా న్యూస్,కౌతాళం;
త్రాగునీరా లేక బురద నీరా శుద్ధి లేకుండా నీటిని సరఫరా చేస్తూ గ్రామస్తుల ఆరోగ్యలతో చలగటం ఆడుతున్నారని అధికారులపై గ్రామస్తులు మండిపడ్డారు. మంగళవారం నీటి కొళాయిలు కోడి ఈకలు పుచ్చాలు , వండు మిరు, గలీజ్ నీరు రావడంతో భయం దోళనలకు గురి అయ్యారు. నీటి బిందెలు కోడి ఈకలు పుచ్చలు రావడం చూసి ఆశ్చర్యపోయారు. ప్రతినీటి బిందె కడవలు ఇలా రావడంతో గ్రామస్తులు మండిపడ్డారు. నీటి సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారా లేక శుద్ధి చేయడంలో విఫలమయ్యారా అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు నీటి శుద్ధి చేయకపోవడంతో కోడిపుచ్చలు వస్తున్నాయని వాపోయారు .అధికారులు వెంటనే స్పందించి శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని లేనిచో ప్రజలు అనారోగ్యానికి గురి అవుతారని కాలనీవాసులు వీరభద్ర, గోపాల్, నరసింహ, ఎల్లారెడ్డి ,తదితరులు వాపోయారు.