సిరాన్యూస్,చిగురుమామిడి
చిగురుమామిడిలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలను కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ వేడుకలలో స్థానిక జడ్పీటీసీ గీకురు రవీందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గాంధీ కుటుంబం దేశానికి చేసిన సేవ మరువలేదని కొనియాడారు. రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాలను రాహుల్ గాంధీ ప్రభావితం చేయబోతున్నారని పేర్కొన్నారు. భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిమల్ల రవీందర్, జిల్లా అధికార ప్రతినిధులు దాసరి ప్రవీణ్ కుమార్ నేత, ఐరేడ్డి సత్యనారయణ,జిల్లా మహిళా వైస్ ప్రెసిడెంట్ ఓరుగంటి భారతీదేవి, నాయకులు శాబొద్దిన్, మహిపాల్ రెడ్డి, ఎలగందుల లక్ష్మణ్, నరేందర్ సింగ్, కక్కర్ల రవీందర్, గందే రాజయ్య, కానవేణి శివ కుమార్, ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి,యువజన కాంగ్రెస్ నాయకులు జిల్లెల్ల రమేష్, శ్రీనివాస యాదవ్, కావటి సంపత్, రాణా ప్రతాప్ సింగ్, వడియాల సంతోష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.