సిరాన్యూస్, చిగురుమామిడి
ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాసరెడ్డిని సన్మానించిన ప్రెస్ క్లబ్ సభ్యులు
చిగురుమామిడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ , జడ్పీటీసీ , ఎంపీటీసీ ల పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిగురుమామిడి ప్రెస్ క్లబ్ సభ్యులు ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి దంపతులను శాలువా మెమోంటోతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రజాసేవలో భాగంగా తమకు ఐదు సంవత్సరాలు పాత్రికేయులు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.జర్నలిస్టులను ఎంపీపీ శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో చిగురుమామిడి ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు పాల్గొన్నారు.