Chigurumamidi: తహసీల్దార్ కార్యాలయంలో సమయపాలన పాటించని అధికారులు

సిరా న్యూస్, చిగురుమామిడి
తహసీల్దార్ కార్యాలయంలో సమయపాలన పాటించని అధికారులు
* విధులకు హాజరుకాని సిబ్బంది
* ఉదయం 11:00 అయిన వెలుగుతున్న విద్యుత్ లైట్లు

చిగురుమామిడి మండల తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు సమయపాలన పాటించడం లేదు. ప్రతి అధికారి ఉదయం 10:00 గంటలకు విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. మంగళవారం 10:45 నిమిషాలు అయినప్పటికీ కార్యాలయంలో ఏ అధికారి విధులకు హాజరు కాకపోవడంతో విధుల పట్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. మంగళవారం ఓ గ్రామానికి చెందిన వారు ధరణి రిజిస్ట్రేషన్ ఉదయం 10:43 నిమిషాలకు ఉన్నప్పటికీ 11:00 గంటలు దాటిన ధరణి ఆపరేటర్లు ,అధికారులు విధులకు హాజరు కాలేదు. దాంతో వారు వేచిచూడాల్సి వచ్చింది. కార్యాలయంలో ముందు లైట్లు కూడ ఆఫ్ చెయ్యలేదు.ఉదయం 11:00గంటల వరకు లైట్లు వెలుగుతూ కనిపించాయి.తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఫీల్డ్ విజిట్ కు, ఎలక్షన్ విధులకు వెళ్లిన..మిగతా అధికారులు మాత్రం సమయపాలన పాటిస్తూ విధులకు హాజరు కావలసి ఉంటుంది.కానీ హాజరు కావడం లేదు. తీవ్రమైన ఎండలు ఉన్నప్పటికీ ధరణి, విద్యార్థులు ఓబీసీ నాన్ క్రిమిలేయర్, ఇతర పనుల గురించి మండల ప్రజలు తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్నారు. సరైన సమయానికి సమయానికి రాకుండా మా పనులు ఏ విధంగా చేస్తారని ప్రశ్నిస్తున్నారు.పై అధికారులు స్పందించి తమ పనులు అయ్యేవిధంగా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *