సిరాన్యూస్, చిగురుమామిడి
ప్రారంభమైన పాఠశాలలు..విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు
ఆటపాటలకు సెలవు..వేసవి సెలవులతో ఇన్నాళ్లు ఎంజాయ్ చేసిన పిల్లలు ఇకపై పుస్తకాల బాట పట్టారు.బుధవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ప్రారంభమయ్యాయి.అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలను ఆకర్షణీయంగా అలంకరించారు. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలను పూలుబెలూన్లతో ఆకర్షణయంగా అలంకరించారు. ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు విద్యార్థులకు స్వాగతం పలికారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు లక్ష్మణరావు ఎంపీటీసీ మిట్టపల్లి మల్లేశం ల ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన జరుగుతుందని తెలిపారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు తమ పిల్లల్ని పంపిస్తే నాణ్యమైన విద్యాబోధన అందిస్తామని భరోసా ఇచ్చారు. అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.