సిరా న్యూస్, చిగురుమామిడి:
బాల్క సుమన్ శవయాత్ర…
రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి బీఅర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కరీంనగర్ జిల్లా చిగరుమామిడి మండల కేంద్రంలో, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బాల్క సుమన్ శవయాత్ర నిర్వహించి, దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి, జడ్పీటీసి గీకురు రవీందర్ మాట్లాడుతూ… గత ఎన్నికల్లో ప్రజలూ బుద్ది చెప్పినా గుణపాఠం నేర్చుకోకుండా అహంకారపూరితంగా మాట్లాడాన్ని ఖండించారు. బాల్క సుమన్ వెంటనే యావత్ రెడ్డి సామాజిక వర్గానికి భేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షం ప్రజాక్షేత్రంలో తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి, జడ్పిటిసి గీకురు రవీందర్, నాయకులు చిట్టిమళ్ళ రవీందర్, దాసరి ప్రవీణ్ కుమార్, బోయిని వంశీ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.