రాజన్న సిరిసిల్ల జిల్లా
సిరా న్యూస్,జగిత్యాల;
స్కూల్ వ్యాన్ ఢీకొని రెండు సంవత్సరాల బాలిక మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మాల్యాల మండలం మద్దుట్ల గ్రామంలో చోటు చేసుకుంది. మద్దుట్ల గ్రామానికి చెందిన ఎండి ఆలిఫా అనే రెండు సంవత్సరాల బాలిక తన సోదరుడు పాఠశాలకు వెళుతూ స్కూల్ బస్సులో కూర్చున్నాడు. తన సోదరునితో వెళ్లాలనే ఆలోచనతో స్కూల్ బస్సు ముందుకు వెళ్ళింది. ఆవిషయాన్ని గమనించని డ్రైవర్ స్కూల్ బస్సును ముందుకు పోనించడంతో ఆలిఫా తలపై టైరు ఎక్కడంతో తలకు తీవ్ర గాయమై మరణించడం జరిగింది. బుడిబుడి అడుగులు వేస్తున్న ఆలీఫా కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో బాలిక తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. ఈ ఘటనతో మద్దుట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
===================xx