బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం

సిరా న్యూస్,తాడేపల్లిగూడెం;

ఆడ పిల్లలకు బాల్య వివాహాలు చేయరాదని చట్టరీత్యా నేరమని , బాల్య వివాహాలు చేసిన వారిని ప్రభుత్వం చట్టరీత్యా చర్యలు తీసుకుంటుందని ఆదర్శ్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్వచ్చంద సేవ సంస్థ అధ్యక్షుడు , ప్రభుత్వ సబ్ డివిజన్ విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు రొక్కాల నాగ బుజ్జి అన్నారు. శనివారం ఆచంటలో ఆదర్శ్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో బాల్య వాహల పై అవగాహన సదస్సు పి . యేసు రత్నం అధ్యక్షతన జరిగింది. రొక్కాల నాగ బుజ్జి మాట్లాడుతూ ప్రభుత్వం నియమించిన నిబంధన ప్రకారంగా ఆడపిల్లలకు 18 సంవత్సరములు నిండిన తర్వాత , పురుషులకు 21 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహాలు చేయాలని అన్నారు. యేసు రత్నం మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను బాగా చదివించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పి ఏసురత్నం , పి బాబురావు , జయప్రకాష్ , పాల్ బాబులు , బాలరాజు , సత్యానందం , ప్రసాదు , రాజేష్ , జీవన్ , బాలరాజు , ఆశీర్వాదం , ఎస్తేరు రాణి , ప్రశాంతి ,మహిళలు , పురుషులు తదితరులు పాల్గొన్నారు.
=================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *