సిరా న్యూస్,ఇచ్చోడ
కార్మికుల హక్కుల సాధన కోసం సీఐటీయూ పోరాటం
*సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు చిన్నయ్య
*ఇచ్చోడలో మేడే వేడుకలు
సంఘటిత, అసంఘటితరంగ కార్మికుల హక్కుల సాధన కోసం సీఐటీయూ పోరాటం చేస్తోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు చిన్నయ్య అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించారు. కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు చిన్నయ్య, జిల్లా సహాయ కార్యదర్శి పవార్ జితేందర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెట్టి చాకిరికి అణచివేతకు పీడనకు వ్యతిరేకంగా ఎనిమిది గంటల పని దినం కోసం కార్మిక హక్కుల సాధన కోసం 1886లో హే మార్కెట్లో కార్మికులు చేసిన పోరాటం పై నాటి పాలకవర్గాలు దాడిచేసి అనేకమంది కార్మిక నాయకుల్ని బలితీసుకుందన్నారు. ఆ త్యాగాల ద్వారానే అనేక దేశాల్లో 8 గంటల పనిదినం అమల్లోకి వచ్చిందన్నారు. అనంతరం కార్మికవర్గం అనేక త్యాగాల ద్వారా పోరాటాల ద్వారా కొన్ని చట్టాలను హక్కులను సాధించిందన్నారు. కార్యక్రమంలో కార్మికులు పాల్లొన్నారు.