సిరాన్యూస్, చిగురుమామిడి
చిన్నమూల్కనూర్ లో ఘనంగా దుర్గమ్మ తల్లికి బోనాలు
* అమ్మవారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పణ
చిగురుమామిడి మండలం చిన్నముల్కనూరు గ్రామంలో సోమవారం దుర్గమ్మ తల్లికి ఎంపీటీసీ సభ్యులు పెసరి జమున రాజేశం ఆధ్వర్యంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున బోనాలతో వచ్చి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి గడప నుండి అమ్మవారికి మహిళలు బోనం ఎత్తుకొని, డప్పు చప్పుళ్ళు శివసతుల పూనకాల మధ్య పురవీధుల గుండా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం నైవేద్యం సమర్పించి, మొక్కులు చెల్లించారు. దుర్గ మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, గోడ్డు గోదా సల్లంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. వారం రోజులుగా జరుగుతున్న దుర్గ మాత విగ్రహ పున ప్రతిష్ట కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని గ్రామ ఎంపీటీసీ సభ్యుడు పెసరి జమున రాజేశం తెలిపారు.జాతరను విజయవంతం చేసిన గ్రామస్తులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో పలుకుల సంఘాల నాయకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.