సిరా న్యూస్,దెందులూరు;
దెందులూరు నియోజకవర్గం అంకన్నగూడెంలో జరిగిన జయహో బి.సి కార్యక్రమంలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
చింతమనేని మాట్లాడుతూ బిసి సాధికారతే ద్యేయంగా రాష్ట్రంలో నిర్మాణం జరిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ పెట్టాకే రాష్ట్రంలో ఎక్కడెక్కడో ఉన్న బిసి వర్గాల వారిని వెతికి మరీ ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. కార్యకర్త నుంచి మంత్రుల వరకు బిసి వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఎమ్మెల్యే గా ఉండగా ఉపాధి హామీ పథకం అమలులో దెందులూరు నియోజక వర్గాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంచాను. పరిపాలన చేతకాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసేసాడని అన్నారు.
జగన్ ప్రభుత్వంలో ఏరులై పారుతున్న కల్తీ మద్యం సారా తాగి బలవుతున్న కుటుంబాల ఉసురు ఈ జగన్మోహన్ రెడ్డికి తగులుతుంది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందే పరిస్థితి లేదు. ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించటలేదు. పేదవాడి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు.
సైకో పాలన పోవాలి. సైకిల్ రావాలి. బాబు ష్యుర్టీ – భవిష్యత్ గ్యారంటీ తో అసలైన ప్రజా సంక్షేమ పాలన అమలు చేస్తాం. మరో 3నెలల్లో జగన్ ప్రభుత్వం భారీ ఓటమితో గద్దె దిగటం ఖాయం. టిడిపి జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం తధ్యమని అయన అన్నారు.