సిరాన్యూస్,ఆదిలాబాద్
పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహిద్దాం
* నాగపూర్ ఐజి డా చిరాంగ్ డోర్జి
* చంద్రపూర్లో అంతరాష్ట్ర బార్డర్ మీటింగ్
* అక్రమ మార్గంలో డబ్బు, మద్యం, గంజాయి, జంతువులు రవాణాకు అడ్డుకట్ట
* చెక్ పోస్ట్ల ఏర్పాటు, అన్ని శాఖల సమన్వయంతో నిర్వహణ
* సమీక్ష లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా,ఎస్పీ గౌష్ ఆలం
రానున్న పార్లమెంటు ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దుతో ఉన్న మహారాష్ట్ర , రాష్ట్ర సరిహద్దు కలిగిన జిల్లాల ఉన్నతాధికారులతో అంతర్రాష్ట్ర బార్డర్ మీటింగ్ బుదవారం మహారాష్ట్ర చంద్రపూర్ లోని ఫారెస్ట్ అకాడమి నందు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాగపూర్ ఐజి డా చిరాంగ్ డోర్జి పాల్గొని ఇరు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేసి ఎన్నికలను సజావుగా నిర్వహించేలా అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల సందర్భంలో ఏర్పాటు చేసే చెక్పోస్టుల పై, వాటి నిర్వహణపై, చెక్ పోస్ట్ ల నందు పోలీసు, ఫారెస్ట్, రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులు ఉంటూ, నిరంతరం పర్యవేక్షిస్తుంటారని తెలియజేశారు. అలాగే బార్డర్ నందు అక్రమంగా అనుమతులు లేకుండా తరలించే మద్యం, డబ్బు, గంజాయి, మాదకద్రవ్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని తెలియజేశారు. ఎన్నికల కోడ్ వచ్చిన వెంటనే ఏర్పాటు చేయవలసిన విషయాల పై జిల్లాల వారిగా వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యల్లో భాగంగా పకడ్బందీగా స్పెషల్ పార్టీ బృందాలచే భద్రతను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ఎన్నికలలో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా రానున్న ఎన్నికలను సజావుగా నిర్వహించాలని సూచించారు. మహారాష్ట్ర , ఆదిలాబాద్ జిల్లాల అధికారులు సంయుక్తంగా ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించాలని ఆన్నారు. అనంతరం ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ ఆలం మట్లాడుతూ అదిలాబాద్ జిల్లా లో బేల మండల్ శంకర గూడ, జైనధ్ మండలంలో ఆనంద్ పూర్, పిప్పర్ వాడ, భీంపూర్ మండలంలో కరంజీ, తలమడుగు లో లక్ష్మిపూర్, బోథ్ లో ఘనపూర్ . 6 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని, పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎస్పీ కే సురేష్ కుమార్, చంద్రపూర్ కలెక్టర్ వినయ్ గౌడ్, అదనపు కలెక్టర్ ఆసిఫాబాద్, ఎస్పీఎం సుదర్శన్, యవత్ మాల్ ఎస్పీ డా పవన్ బన్సద్, ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.