Chirutha died:ఐదుకల్లు అటవీ ప్రాంతంలో చిరుత మృతి

సిరా న్యూస్, కళ్యాణదుర్గం
ఐదుకల్లు అటవీ ప్రాంతంలో చిరుత మృతి
* వారం కిందట అనారోగ్యంతో మృతి చెందినట్లుగా నిర్ధారణ
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని ఐదుకల్లు అటవీ ప్రాంతంలో చిరుత మృతి చెందింది. వారం కిందట అనారోగ్యంతో చిరుత మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు . వన్యప్రాణులకు తాగునీటి వసతి లేక మైదాన ప్రాంతంలోకి వచ్చి వ్యవసాయ పొలాల్లో నీళ్లు తాగి పోతున్నాయని రైతులు చెప్తున్నారు. ఇటీవల కరెంటు కొరత కారణంగా బోరు బావుల్లో కూడా నీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్నామని చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు అటవీ ప్రాంతం నుంచి బయటికి వచ్చి దాహంతో అనారోగ్యానికి గురవుతున్నాయని అటవీశాఖ అధికారులు అంటున్నారు. ఐదుకల్లు అటవీ ప్రాంతంలో వారం కిందట మృతి చెందిన చిరుతను గుర్తించామని పోస్టుమార్టం నిర్వహిస్తే అనారోగ్యానికి గురైనట్లు గుర్తించామని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నాగే నాయక్ తెలిపారు . భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా మన్యప్రాణులకు తాగునీటి వసతి కల్పిస్తామని అధికారులకు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *