సిరాన్యూస్, చిగురుమామిడి
చిగురుమామిడి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా చిట్టంపల్లి శ్రీనివాస్
* నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఎన్నిక
చిగురుమామిడి మండలంలో ప్రెస్క్లబ్ నూతన కార్యవర్గాన్ని మండల కేంద్రంలోని డార్విన్ పాఠశాలలో గౌరవ అధ్యక్షులు బుర్ర పరశురాములు, కొంకట బాలయ్య ఆధ్వర్యంలో బుధవారం ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా చిట్టంపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా రాకం కరుణాకర్ లను ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకున్నారు.అనంతరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ చిగురుమామిడి మండలంలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. కోశాధికారిగా తాళ్ల నరేష్, ఉపాధ్యక్షులుగా ఎనగందుల రవీందర్, సంయుక్త కార్యదర్శిగా పత్తెం రమేష్, మారుపాక రమేష్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు గుడికందుల దేవదాసు,బోయిని సంపత్,రాకం అనిల్,ఆకుల రాజు, వేల్పుల క్రాంతికుమార్, జీడి నగేష్, ముంజ శ్రీకాంత్, బొల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Great